1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (11:53 IST)

నెల్లూరులో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుసూదన శాస్త్రికి నివాళి

నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతి చెందారు. ఎంతో పేరొందిన డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి భౌతికకాయానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులర్పించారు. డాక్ట‌ర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 
అంకిత భావంతో సేవలు అందించడం ద్వారా డాక్టర్ అంటే మధుసూదన శాస్త్రినే అనే ప్రత్యేక గుర్తింపు పొందార‌ని సోమిరెడ్డి పేర్కొన్నారు.న ఆయ‌న నెల్లూర న‌గ‌రానికే కాదు...చుట్టుప‌క్క‌ల ప‌లు గ్రామాల వారికి గొప్ప వైద్యుడ‌ని, అతి త‌క్కువ ఫీజుతో అంద‌రికీ ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. డాక్ట‌ర్ మ‌ధుసూధ‌న శాస్త్రి వైద్య వృత్తిపరమైన బాధ్యతల నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయుల‌ని, త‌మ‌ తండ్రి గారి నుంచి, త‌న వరకు ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉంద‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మధుసూదన శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు. 

నెల్లూరులో ప్రముఖ వైద్యులైన డాక్టర్ మధుసూదన శాస్త్రి మృతికి న‌గ‌రంలోని ప‌లువురు సంతాపం తెలిపారు. భారీగా జ‌నం ఆయ‌న అంతిమ యాత్ర‌లో పాల్గొని నివాళులు అర్పించారు.