1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:09 IST)

ఇజ్రాయెల్‌లో కిరాతకం.. గర్భవతి కడుపును చీల్చి.. బిడ్డను..?

ఇజ్రాయెల్​లో హమాస్​ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. సామాన్యులను.. ఉగ్రవాదులు చంపిన విధానం కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్​ కూడా తన సైన్యంపై విరుచుకుపడింది. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 
 
ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు.. ఓ గర్భవతి కడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసి మరీ చంపేశారు. ఈ కిరాతక చర్యపై ప్రపంచం నివ్వెరపోయింది. గత శనివారం నుంచి ఓ వైపు రాకెట్ల దాడి జరుగుతుంటే.. మరోవైపు హమాస్​ ఉగ్రవాదులు.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్​వాసులకు నరకం చూపించారు. వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని చంపుకుంటూ వెళ్లారు. అనేకమందిని కిడ్నాప్​ చేసి, హత్య చేశారు.
 
యొస్సీ లాండౌ బృందం బీరి అనే ప్రాంతానికి వెళ్లింది. గాజా నుంచి ఐదు కి.మీల దూరంలో ఉండే ఆ ప్రాంతంలో 1,200 మంది నివాసముండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 
 
ఈ బృందం ఓ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ గర్భవతి మృతదేహం పడి ఉంది. ఆమె కడుపును సగం చీల్చేశారు. కడుపులో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారని యొస్సీ లాండౌ వివరించారు. ఆ ఘటన కన్నీళ్లు తెప్పించాయి.