సంబంధిత వార్తలు
- పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా... మా మీద పడి ఏడుస్తారేంటి : చిరంజీవి
- సాకులు చెప్పకుండా ఈసారైనా ఓటు హక్కు కల్పిస్తారా? లేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్
- పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ & శాసనసభ పుస్తకావిష్కరణ
- అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులతో దడ పుట్టించిన వైకాపా నేతలు
- న్యాయ దేవతకు క్షీరాభిషేకం.. నిలిచిన నిర్మాణాలు
రైలు కిందపడి యువ దంపతుల ఆత్మహత్య... ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ విషాదకర ఘటన జరిగింది. యువ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి వివాహమై పక్షం రోజులు కూడా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేర్వేరుగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు కలకలం రేపింది. సోమవారం భార్య రైలు కిందపడగా.. మంగళవారం ఉదయం భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రైల్వే పోలీసులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడకు చెందిన మంజునాథ్ (26), పొట్లూరి మండలం గరుగు చింతలపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (24) ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తాడిపత్రి సమీపంలోని తెల్లవారిపల్లి వద్ద రమాదేవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తాడిపత్రిలో రైలు కిందపడి మంజునాథ్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఏ కారణంతో ఇలా తనువు చాలించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం
