1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (11:35 IST)

సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం..

ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం నిరసనలు చేపడుతోంది. 
 
సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వ‌ర‌కు టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి వారి నిరసన తెలిపారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొన్న నారా లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో మ‌ద్యం ఏరులైపారుతోందంటూ విమ‌ర్శించారు. దాని వ‌ల్ల‌ వందలాది మంది చనిపోతున్నారని ఆరోపించారు. మద్య నిషేధంపై ఇచ్చిన హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు.
 
ఏపీలో కరోనా కంటే ఎక్కువగా కల్తీసారాతో చనిపోయారని  నారా లోకేష్ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.