1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (11:01 IST)

కరోనా కేసుల కంటే విపక్ష నేతలపై పెడుతున్న కేసులే అధికం : అచ్చెన్న

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలోనూ, కరోనా రోగుకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చడంలోనూ, వ్యాక్సిన్లు సాఫీగా చేయడంలోనూ పూర్తిగా విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం నేతలు ఏకిపారేస్తున్నారు. 
 
తాజాగా టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, 'రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల కన్నా ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి గుంటూరులో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళిన టీడీపీ నేతలపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేయడం దారుణం. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు మున్ముందు వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదు' అని ఆయన హెచ్చరించారు.