1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TTD Services to Be Streamlined: Nara Lokesh

శ్రీవారి దర్శనం కోసం ఇక గంటల సేపు క్యూల్లో నిలబడనవసరం లేదు.. నారా లోకేష్

Nara Lokesh
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయానికి రోజూ 60,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. అధిక రద్దీ దర్శన ఏర్పాట్లలో ఇబ్బందులను సృష్టిస్తోంది, భక్తులు క్యూ కాంప్లెక్స్‌ల వద్ద ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, భక్తులు దర్శనం కోసం ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
 
ఎక్కువ సామర్థ్యం కోసం టికెట్ బుకింగ్, ఆలయ సేవలను క్రమబద్ధీకరించనున్నట్లు నారా లోకేష్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టిటిడి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చామని లోకేష్ పేర్కొన్నారు. భక్తులను ఆలయ సేవలకు మరింత చేరువ చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో రెండవ రోజు నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తర్వాతి కథనం
విశాఖలో పర్యటించనున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి