శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:30 IST)

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు- ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2)

హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేల్చింది నాంపల్లి అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి (ఏ1), అనీఖ్ షఫీఖ్‌ సయ్యద్‌ (ఏ2) దోషులుగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 
 
అనీక్‌ షఫీక్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ను దోషులుగా నిర్థారిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరికి శిక్షలపై సోమవారం తీర్పు ప్రకటించనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌, సాధిక్‌ ఇసార్‌, అంజుమ్‌లను నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.
 
కాగా, 2007 ఆగస్టు 25న నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 42 మంది మృతిచెందగా 70 మందికి పైగా గాయాల పాలైయ్యారు. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్‌ బృందం తేల్చింది. 
 
రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ సహా పలువురిని నిందితులుగా చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో అరెస్టైన వారిలో ఐదుగురు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆగస్టు 27వ తేదీన తుది విచారణ జరిపిన కోర్టు, సెప్టెంబర్ నాలుగో తేదీన (మంగళవారం) తుది తీర్పు వెలువరించింది. 
 
ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ ఘటనకు సంబంధించిన 286 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1125 పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. మూడు విడతలుగా చార్జీషీటును దాఖలు చేశారు.