1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2024 (15:18 IST)

గుంటూరు వెస్ట్ స్థానానికి నామినేషన్ వేస్తున్న విడుదల రజినీ కిడ్నాప్, పోలీసులు సెర్చింగ్

kidnap
ఏపీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికివారే పోటాపోటీగా రోడ్ షోలు, స్ట్రీట్ కాంపెయిన్లు చేస్తున్నారు. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరు పక్షాల్లోనూ ఓటమి భయం వెంటాడుతోంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న బెంగ పట్టుకుని ఊపిరాడనీయడంలేదు. ఏ పార్టీ సభ ఏర్పాటు చేసినా ఆ పార్టీకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీనితో వారు ఎవరికి గట్టిగా బుద్ధి చెబుతారో అర్థంకావడంలేదు. ఇదిలావుంటే ఏపీలోని గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది.
 
గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు విడుదల రజినీ అనే మహిళ రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నది. ఐతే ఆ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థిని ఎవరో కిడ్నాప్ చేసారన్న వార్తలు రావడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

కాగా సదరు మహిళ పేరుతోనే వైసిపి ఎమ్మెల్యే విడదల రజినీ వుండటంతో టీడీపీయే బలవంతంగా నామినేషన్ వేయించేందుకు యత్నం చేసిందని వైసిపి అంటుంటే... వైసిపి నాయకులు స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసారంటూ తెదేపా నాయకులు అంటున్నారు. ఐతే పోలీసులు సదరు మహిళ జాడను కనుగొన్నట్లు సమాచారం.