ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :vijayawada , మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:45 IST)

విజయసాయి బెయిల్‌ రద్దుపై విచారణ ఈ నెల 13కు వాయిదా

ఒక‌ప‌క్క సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపైనా, మ‌రో ప‌క్క ఎంపీ విజ‌య‌సాయిపైనా ఎంపీ ర‌ఘ‌రామ త‌న విల్లు ఎక్కుపెట్టే ఉంచుతున్నారు. వారిద్ద‌రి బెయిల్ ర‌ద్దుకు ఆయ‌న న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు దాఖ‌లు చేసిన‌ పిటిషన్ పై తదుపరి విచార‌ణను సీబీఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఈ నెల 7న‌ రఘురామ కృష్ణ‌రాజు పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

ర‌ఘురామ వేసిన‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈ రోజు విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ నేప‌థ్యంలోనే విచార‌ణ వాయిదా ప‌డింది.

ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులో సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై కూడా కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే.