1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (13:25 IST)

టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే మద్యం: పవన్ కల్యాణ్

pawan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీయే నుంచి టీడీపీలోకి రావడంపై చేసిన ప్రకటనలు అందరినీ అయోమయంలో పడేశాయి. జనసేన ఎన్డీయే కూటమిపై అయోమయం నెలకొని ఉండగా, పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రచారాల్లో ఎన్నికల వాగ్ధానాలు చేసేటపుడు జేఎస్పీ-టీడీపీ పొత్తుల ప్రస్తావన ఉండేలా చూసుకుంటున్నారు.
 
తాజాగా, జేఎస్పీ-టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందజేస్తామని మద్యం ప్రియులకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

మార్కెట్‌లో చీప్ లిక్కర్‌పై సెటైర్లు వేస్తూ.. ఇప్పుడు అందుబాటులో ఉన్న తక్షణమే డ్యామేజ్ చేసే ‘నాణ్యమైన’ మద్యం కాకుండా నిదానంగా ఆరోగ్యాన్ని పాడుచేసే ‘నాణ్యత’ మద్యాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మహిళలు, గ్రామ పంచాయతీలు ఎంచుకుంటే కొన్ని గ్రామాల్లో మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. 
 
క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో మ‌ద్యం దుకాణాలు మూసివేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు ఎలా ఇబ్బందులు ప‌డుతున్నారో తాను చూశాన‌ని, వాటిని తిరిగి తెరిచినప్పుడు ప్రజలు డ్యాన్స్ చేయడం తాను చూశానని అన్నారు.