సంబంధిత వార్తలు
- ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!
- ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..
- ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు.. లక్షల్లో లావాదేవీలు
- పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?
అన్నయ్య లండన్కు.. చెల్లెమ్మ అమెరికాకు..!
ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జూన్ 1 వరకు తన కూతుళ్లతో గడపడానికి ఏపీ సీఎం జగన్మోహన్ లండన్లో ల్యాండ్ అయ్యారు. సిబిఐ వ్యతిరేకించినా నాంపల్లి సిబిఐ కోర్టు యాత్రకు అనుమతి ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్లో తన అభ్యర్థులతో సమావేశమై పోలింగ్పై విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత షర్మిల కామ్ అయిపోయారు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
అయితే ఆమె ఎక్స్లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాన్ని పోస్ట్ చేశారు. షర్మిల కూడా అన్నయ్య లండన్ వెళ్లినట్లు తన కొడుకు, తల్లి విజయ లక్ష్మితో గడపడానికి సెలవుల నిమిత్తం యునైటెడ్ స్టేట్స్ వెళ్లినట్లు టాక్ వస్తోంది.
