సంబంధిత వార్తలు
దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థిగా సంతోషి రూపవాణి
Duggirala
ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీ, జనసేనలకు చెందిన గెలిచిన ఎంపీటీసీలో ఎవరూ బీసీలు లేకపోవడంతో వైసీపీ అభ్యర్థి సంతోషి రూపవాణితో ఎమ్మెల్యే ఆర్కే దగ్గరుండి నామినేషన్ను వేయించారు.
ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన 9 మంది సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది గెలుపొందగా ఒకరు జనసేనకు చెందిన అభ్యర్థి విజయం సాధించారు. గత ఏడాదిన్నర కాలం టీడీపీ కోర్టుకెక్కడంతో ఆగిపోయిన ఈ ఎన్నికలు గురువారం జరిగాయి.
దుగ్గిరాల బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బీఫామ్ ఇచ్చిన ఒకే ఒక్క అభ్యర్థి సంతోషి రూపవాణి నామినేషన్ దాఖలు చేసింది. గడువులోగా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.
