గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (12:51 IST)

చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదు.. రైతుల్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం...?

రైతులను మోసం చేసి అక్రమంగా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును వదలబోనని వైకాపా మ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అంతేగాకుండా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎం అయినప్పటికీ.. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబుపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రాజధాని మార్పు జరుగుతుందని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 
దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారని ఆళ్ల తెలిపారు. అయితే రైతులను మోసం చేసి బలవంతంగా భూములు లాక్కొనే ప్రయత్నం మాత్రం తమ ప్రభుత్వం చెయ్యదని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేశారు.