శుక్రవారం, 28 జూన్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (19:02 IST)

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పచ్చి మిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే అనేక రోగాల నుండి బయటపడవచ్చుననే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదెలాగో చూద్దాం.. పచ్చి మిరకాయలలో పోషకాలు ఉన్నాయి.  పచ్చి మిరపకాయలను నానబెట్టిన నీటిని తాగడం చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. కారణం ఇందులో విటమిన్ సి వుండటమే. అవి శరీర రోగనిర్ధారణ, వైరస్‌ల నుంచి దూరంగా వుంచుతాయి. ఇంకా ఇందులో బీటా కరోటిన్ ఉంది. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడం వలన వచ్చే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.
 
మధుమేహాన్ని నియంత్రించడంలో పచ్చిమిర్చిలను నానబెట్టిన నీరు బాగా పనిచేస్తుంది. మధుమేహ రోగుల చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి పచ్చిమిర్చి నీటిలో వున్నాయి. ఈ నీరు త్రాగితే, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అంతేగాకుండా ఇది బరువును నియంత్రిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత రోగాలు దూరమవుతాయి. పచ్చిమిర్చిలోని యాంటియాక్సిడెంట్లు, విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
పచ్చిమిర్చిలను ఎలా నానబెట్టాలి..?
 
రాత్రి నిద్రపోయే ముందు 3-4 పచ్చిమిర్చిలను బాగా కడిగి, దాని మధ్యలో కోసి, 1 గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని తెల్లవారుజామున పరగడుపున త్రాగాలి.