శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 అక్టోబరు 2022 (23:23 IST)

క్రోమా: టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, మరెన్నో అంశాలపై అత్యుత్తమ డీల్స్‌

croma
ఎక్కువ మంది అభిమానించే, వేడుక చేసే పండుగ,దీపావళి కోసం ఇండియా సిద్ధమవుతున్న వేళ, భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత నమ్మకమైన ఓమ్నీ ఛానెల్‌ ఎలక్ట్రానిక్స్ రిటైలర్‌ బ్రాండ్‌, టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా, ఇప్పుడు అసలు వదులుకోలేనట్టి దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు మీ ఆనందాన్ని మరింత పెంపొందించడం మాత్రమే కాదు, ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ ప్రచారంతో సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. వినియోగదారులు తమ అభిమాన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అక్టోబర్‌ 30, 2022 వరకూ అత్యుత్తమ డీల్స్‌, రాయితీలను అందుకోవచ్చు.
 
పలు బ్యాంక్‌ కార్డులపై 10% వరకూ రాయితీని సైతం వినియోగదారులు పొందవచ్చు. త్రీ స్టార్‌ ఫ్రాస్ట్‌ ఫ్రీ ఇన్వర్టర్‌ కన్వర్టబల్‌ రిఫ్రిజిరేటర్లు 23,990 రూపాయలతో ప్రారంభమవుతాయి. అక్టోబర్‌ నెల ప్రారంభం కావడంతో వోల్టాస్‌ మరియు శాంసంగ్‌ కన్వర్టబల్‌ ఏసీలు 2,999 రూపాయల నెలవారీ వాయిదాలలో స్టోర్స్‌, ఆన్‌లైన్‌ వ్యాప్తంగా లభ్యమవుతాయి. 6కేజీల ఫుల్లీ ఆటోమేటిక్‌ ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్లు 20,990 రూపాయల ధరలో లభిస్తాయి. అదే సమయంలో శాంసంగ్‌ 8కేజీ ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లు నెలకు 3333 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి.
 
శాంసంగ్‌, రియల్‌ మీ, ఒన్‌ప్లస్‌ నుంచి అత్యుత్తమ శ్రేణి 5జీ స్మార్ట్‌ఫోన్లు 13,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. ఇక్కడితో ముగియదు. ఎంపికచేసిన  స్మార్ట్‌ఫోన్‌లపై  4,999 రూపాయల విలువ కలిగిన స్మార్ట్‌వాచ్‌లను సైతం ఉచితంగా పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో మీ ల్యాప్‌టాపఃలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకునే  మీ కలలను క్రోమాతో సాకారం చేసుకోండి. 11 వ తరపు  ఇంటెల్‌ కోర్‌ ఐ3 ల్యాప్‌టాప్‌లు 31,990 రూపాయల  ప్రారంభ ధరతో, ఏఎండీ రైజెన్‌ ల్యాప్‌టాప్‌లు 26,990 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి.
 
గత దశాబ్ద కాలంగా పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు అత్యుత్తమంగా విర్రయించబడుతున్న ఉత్పత్తులుగా నిలుస్తున్నాయి. ఈ విభాగాలలో అత్యంత వేగవంతంగా సాంకేతిక ఆవిష్కరణలు కూడా జరుగుతుండటంతో వినియోగదారులు తమ స్ర్కీన్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు. ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ స్ర్కీన్‌లకు మారడంతో పాటుగా అత్యుత్తంగా సాఫ్ట్‌వేర్‌ను మిళితం చేసుకోవడంతో రిజల్యూషన్‌ కూడా పెరుగుతుంది. వెబ్‌ ఆధారిత కంటెంట్‌ వీక్షణకు డిమాండ్‌ పెరుగుతుంది. ఇలాంటి వారి కోసం శాంసంగ్‌ క్యుఎల్‌ఈడీ టీవీలు  నెలకు 1990 రూపాయల ధరతో లభిస్తాయి. అదనంగా ఎల్‌ఈడీ టీవీలపై ఐదు సంవత్సరాల  వరకూ వారెంటీని క్రోమా అందిస్తుంది.
 
హోమ్‌ థియేటర్‌ అనుభవాలను జొడించడం కోసం సౌండ్‌బార్లు 2,799 రూపాయల ధరలో లభ్యమవుతాయి. బ్లూటూత్‌ స్పీకర్లు 499 రూపాయల ప్రారంభ ధరలో  లభిస్తే, పార్టీ స్పీకర్లు 2199 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తాయి. సొంత బ్రాండ్లపై కూడా క్రోమా భారీ రాయితీలను అందిస్తుంది. క్రోమా 370 లీటర్‌ త్రీస్టార్‌ ఫ్రాస్ట్‌ ఫ్రీ  ఇన్వర్టర్‌ రిఫ్రిజిరేటర్‌ 26,990 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది. క్రోమా ఫైర్‌ టీవీ 10,990 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది.
 
ఈ పండుగ సీజన్‌ గురించి  క్రోమా ఇన్ఫినిటీ రిటైల్‌ లిమిటెడ్‌ ఎండీ-సీఈఓ శ్రీ అవిజిత్‌ మిత్రా మాట్లాడుతూ ‘‘ఈ పండుగ సీజన్‌ పట్ల మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. దేశవ్యాప్తంగా  ఇండిపెండెంట్‌ సేల్స్‌, ఓణం సేల్స్‌లో కనిపించిన ధోరణులను పరిగణలోకి తీసుకుని ఈ సీజన్‌లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నాము. స్పష్టంగా చెప్పాలంటే, మా వినియోగదారులు దేశవ్యాప్తంగా మా స్టోర్లలో తమ గాడ్జెట్స్‌ను ఆధునీకరించుకోవచ్చు. ఈ పండుగ సీజన్‌లో మా వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించనున్నాము’’ అని అన్నారు.