1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (08:13 IST)

ఏపీ - తెలంగాణాల్లో సెంచరీ కొట్టిన డీజిల్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇపుడు డీజిల్ ధర కూడా సెంచరీ కొట్టేసింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 
 
వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.
 
దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది. నిన్న గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15 పెంచిన విషయం తెలిసిందే.