1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:19 IST)

EPFO update:24 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త

దాదాపు 24 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త చెప్పేందుక  కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈపిఎఫ్‌వో యొక్క అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మార్చిలో జరిగే సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2021-22కు పెంచవచ్చని తెలుస్తోంది.  
 
వచ్చే నెలలో జరిగే ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు నిర్ణయించబడుతుంది. 2021-22 వడ్డీరేట్లను నిర్ణయించే ప్రతిపాదన చర్చకు గౌహతి వేదిక కానుంది. ఈపీఎఫ్‌వో సిబిటి సమావేశం మార్చిలో జరుగుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. 
 
ఈపీఎఫ్‌వో 2021-22 వడ్డీరేటు 2020-21 మాదిరిగా 8.5% వద్ద ఉంటుందా అని ఇటీవల మీడియా అడిగినప్పుడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ఆధారంగా వడ్డీరేటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు భూపేంద్ర తెలియజేశారు.  
 
ప్రస్తుత సంవత్సరానికి వడ్డీరేట్లపై సిబిటి నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫార్వర్డ్ చేస్తారు. మార్చి 2020లో, ఈపిఎఫ్‌వో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 8.5%కు తగ్గించింది, ఇది 7 సంవత్సరాలలో కనిష్ట స్థాయిగా పరిగణించవచ్చు.  
 
ఈపిఎఫ్ వో ఇటీవల తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 24 కోట్లకు పైగా పిఎఫ్ ఖాతాల్లో వడ్డీ నిజమచేసినట్లు తెలియజేసింది. ఇది 8.5% వడ్డీ రేటుపై చేయబడింది.