గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:28 IST)

పసిడి ధరలు.. వెండి ధరలు పెరిగిపోయాయ్... బంగారం కొనాలనుకునే వారికి?

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపాయి. బంగారం కొనాలని భావించే వారికి దీంతో షాక్ తప్పలేదు. బంగారం ధర దూసుకెళ్లింది. ఈరోజు బంగారం ధర పైపైకి ఎగసింది. వెండి కూడా పైకి చేరింది. 
 
గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరుగుదలతో రూ.48,930కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 పెరుగుదలతో రూ.44,850కు చేరింది. 
 
బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.300 పెరుగుదలతో రూ.73,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.