1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (11:03 IST)

స్టాక్ మార్కెట్ పతనం.. నిరుపేదలుగా ఇన్వెస్టర్లు రూ.11లక్షల కోట్లు స్వాహా

Stock Market
శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. దీంతో మదుపరులు ఏకంగా రూ.11 లక్షల కోట్లు నష్టపోతున్నారు. 
 
ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23% వరకు పడిపోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లలో క్షీణత,గ్రూప్‌కు ఎక్స్‌పోజర్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్‌లపై దాని స్పిల్‌ఓవర్ ప్రభావం కారణంగా ఈ నష్టం జరిగిపోయింది.
 
ఇందులో భాగంగా బీఎస్ఈ, నిఫ్టీ రెండూ మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం బాగా పడిపోయాయి. 
 
ముగింపులో, సెన్సెక్స్ 874.16 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో 1.45% క్షీణించింది తద్వారా బీఎస్ఈ 59,330.90 వద్ద నిలిచింది. నిఫ్టీ 287.70 పాయింట్లు నష్టపోయి.. 1.61% క్షీణించి 17,604.30 వద్ద నిలిచింది.
 
అదానీ గ్రూప్ ఎఫెక్ట్‌తో బుధవారం నుంచి దాదాపు రూ. 11 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారులను నిరుపేదలకు గురిచేసింది.