శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (21:59 IST)

జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్ ఆయుష్మాన్ ఖురానాతో సచ్చే రంగ్ ఉద్యమం

జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్, భారతదేశపు వాతావరణ అనుకూల పెయింట్స్ కంపెనీ మరియు 12 బిలియన్ యుఎస్ డాలర్ల జె.ఎస్.డబ్ల్యు గ్రూపు భాగంస్వామ్య సంస్థ, ఈ నెల తమ కొత్త మార్కెటింగ్ ఉద్మమం సచ్చే రంగ్ ప్రారంభిస్తుంది. ఈ ఉద్యమానికి ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు మరియు ఈయన భారతదేశపు పెయింట్స్ మార్కెట్లో ధరల పారదర్శకత లోటు గురించి ఒక విధ్వంసక ప్రకటన చేస్తున్నారు. ఈ 360- డిగ్రీల ఇంటిగ్రేటెడ్ కేంపైన్, జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్ యొక్క ‘ఏ రంగైనా ఒకే ధర’అనే బ్రాండ్ వాగ్దానానికి పూర్తిగా ఒక కొత్త కేన్వాస్ అందిస్తున్నది. ఇది ఐపిఎల్ 2021 సమయంలో ఆకాశవాణి మరియు ప్రాంతీయ టీవీ చానెల్స్‌లో ప్రసారం అవుతుంది.
 
ఈ కొత్తజె.ఎస్.డబ్ల్యు పెయింట్స్టీవీసి ఉద్యమం, ప్రసిద్ధ హోమ్ పెయింటింగ్ సీనరియోని ఒక సరికొత్త రూపంలో సృష్టించబడిన మూడు వీడియో ప్రకటనల సంగ్రహం. మెయిన్ లీడ్లో ఆయుష్మాన్ ఖురానా, పెయింటింగ్ రంగంలో వాటిని కొనేటప్పుడు వాటి ధరల విషయంలో పారదర్శకత లోపం విషయంలో అవగాహన కలగజేస్తూ, దాని వలన హోమ్ పెయింటింగ్ ఒక ఖరీదైన విషయంగా మారుతున్నదని తెలియజేస్తారు.
 
ఈ మూడు వీడియో ప్రకటనలు పెయింటింగ్ పరిస్థితులలో ఒక పెర్ఫక్ట్ ఆఫర్ నుషోకేస్ చేస్తూ‘ఏ రంగైనా ఒకే ధర’అనే జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్ యొక్క విశిష్టమైన బ్రాండ్ వాగ్దానాన్ని ఒక చక్కని సదవకాశం అని ఈ పెయింట్స్ యొక్క విధ్వంసక రూపాన్ని ఆయుష్మాన్ ఖురానా వివరిస్తారు. అవగాహన లేని వినియోగారులను తమ గృహాల నూతన రూపానికి ఉపయోగించే రంగుల కొనుగోలుకు అధిక ధరలు చెల్లించే చీకటి కోణం గురించి వివరిస్తారు. అలా ఈ మూడు ప్రకటనలు ఒకే విధమైన కామన్ స్వరూపం కలిగి ఉంటాయి. ఈ ఉద్యమం యొక్క ప్రాథమిక ఆకర్షణ, రంగుల పరిశ్రమలో ఉన్న ఈ అనుచిత మరియు మోసపూరిత పద్ధతి మీద ఒక దృఢమైనఛాలెంజ్ చేయుట అని మనం చెప్పవచ్చు.
 
ఈ కొత్త ఉద్యమం మీద స్పందిస్తూ శ్రీ ఎ.ఎస్.సుందరేశన్, జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్ జాయింట్ ఎమ్.డి మరియు సిఇఒ ఇలా అన్నారు,“ మా కొత్త సచ్చే రంగ్ ఉద్యమం, ఈ పరిశ్రమలో ఒక ఉత్పాదనలో వేరు వేరు రంగలులకు అధికంగా చెల్లించాలి అని ఉన్న ఒక అన్యాయమైన పరిశ్రమ విధానంపై స్పాట్ లైట్ కేంద్రీకరిస్తున్నది. ఒకే ధరలో 1808 రంగులు, అవి వైట్స్, పేస్టల్స్, మిడ్ టోన్స్ లేదా డీప్ ఏక్సెంట్స్ ఏవైనా కానీయండి, ‘ఏ రంగైనా ఒకే ధర’అనే ప్రస్తావన ద్వారాపరిశ్రమలో మొట్టమొదటి సారిగా వాటిని అందజేస్తూ, ఈ సంస్థ మొత్తం పెయింట్ మార్కెట్ ని తమ విధ్వంసక విధానంతో కుదిపేస్తూ ఉన్నది.
 
వినియోగదారులు తమకు నచ్చిన రంగులు ఎంచుకునే స్వేచ్చ ఉండాలి అన్నదిఈ ప్రస్తావనలో ముఖ్యమైన ఉద్దేశం. ఆయుష్మాన్ ఆకర్షణీయంగా వినియోగదారులను ‘ఏ రంగైనా ఒకే ధర’అనేనిజం వైపు - జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్ బ్రాండ్ వాగ్దానంప్రస్తావన వేదిక మీదకు తీసుకువస్తున్నారు. దీని ద్వారా అసమాన మరియు అన్యాయ ధరల విధానాన్నిమెయిన్ స్ట్రీమ్ పరివర్తనలోనికి తీసుకు రాబడుట జరుగుతుంది.”
 
సాంప్రదాయ పెయింట్ ప్రకటనల ల్యాండ్ స్కేప్ లో ఇలాంటి ఉద్యమం యొక్క విధ్వంసక సమర్థతమీద స్పందిస్తూ టిబిడబ్ల్యుఎ\ఇండియా సిఇఒ శ్రీగోవ్ంద్ పాండే ఇలా అన్నారు, “ఈ కేటగిరీలో ఒక అతి చిన్న ప్లేయర్ గా జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్ తాజా దృష్టికోణంతో చూస్తున్నది మరియు ఈ పరిశ్రమలోని కొన్ని సాప్రదాయ పద్దతులలో న్యాయబద్ధతగురించి గట్టిగా ప్రశ్నిస్తున్నది.”
 
ఈ ఉద్యమం యొక్క క్రియేటివ్ స్ట్రాటజీ గురించి ఒక నోట్ జతపరుస్తూ, మేనేజింగ్ పార్టనర్ – క్రియేటివ్, పరీక్షిత్ భట్టాచార్య ఇలా అన్నారు, “ఇది ఒక వినియోగదారుని బ్లైండ్ స్పాట్. ఒక్కొక్క షేడ్ కు తాము ఎక్కువ చెల్లిస్తూ ఉన్నామని వారికి తెలియదు. ఈ ఉద్యమం జె.ఎస్.డబ్ల్యు అందిస్తున్న ఒక కళ్లు తెరిపించే నిజమైనవినియోగదారు అవగాహన సందేశం. ఈ అంశం చక్కగా ఆలోచించవలసినది!”