1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (21:59 IST)

కిన్లే మళ్లీ తెరపైకి వచ్చింది, ధోనీతో కలిసి ‘బూంద్ బూంద్ మే విశ్వాస్’ ప్రచారం

కోకా-కోలా ఇండియా యొక్క విశ్వసనీయ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన కిన్లే, భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నటించిన 'బూండ్ బూంద్ మే విశ్వాస్' ప్రచారాన్ని ప్రారంభించింది. బ్రాండ్ నమ్మకం, స్వచ్ఛత యొక్క విలువను నిజంగా విశ్వసిస్తుంది. దశాబ్దాలుగా వినియోగదారులచే అత్యంత ఇష్టపడే బ్రాండ్‌లలో ఒకటిగా ఉండటం ద్వారా భారతదేశంలో నమ్మదగినదిగా నిలిచింది. కోకా-కోలా ఇండియా యొక్క స్థానిక పోర్ట్‌ఫోలియోలోని బలమైన ఉత్పత్తులలో ఇది ఒకటి.

 
ఈ కొత్త ప్రచారంతో, కిన్లే తన వినియోగదారులలో 'విశ్వాసం' అనే ఒక గొప్ప భావనను కలిగించడం మరియు "కొంచెం నమ్మకం చాలా దూరం వెళ్తుంది" అనే సందేశాన్ని వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీవీసి ధోని యొక్క కష్టతరమైన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. అతనిపై విశ్వాసాన్ని వుంచిన, అతని ప్రయాణంలో అతనికి బేషరతుగా మద్దతునిచ్చిన వారందరికీ వెలుగునిస్తుంది. ధోనీ, 15 ఏళ్లుగా భారత క్రికెట్ అభిమానులకు నమ్మకానికి నిదర్శనం. కిన్లే దాని వినియోగదారులకు ప్రతి బొట్టులో నాణ్యత, స్వచ్ఛతను అందించడానికి సరికొత్త సాంకేతికతతో ఖచ్చితమైన శాస్త్రీయ పరిశోధనల కలయికతో తయారుచేయబడింది.

 
కొత్త ప్రచారం గురించి మాట్లాడుతూ, కోకాకోలా ఇండియా నైరుతి ఆసియా మార్కెటింగ్, హైడ్రేషన్ కాఫీ- టీ కేటగిరీ డైరెక్టర్ కార్తీక్ సుబ్రమణియన్ ఇలా వ్యాఖ్యానించారు, “విశ్వాసం శాశ్వతమైన మానవ విలువను కలిగి ఉంటుంది, అలాగే కొనసాగుతుంది. ఈ భావోద్వేగం యొక్క అందం మరియు శక్తిని అలాగే మన స్వంత జీవితంలో మనమందరం చేసే పురోగతికి ఇది ఎలా ప్రధానమైనది అని నొక్కిచెప్పడానికి కిన్లే ప్రయత్నిస్తుంది. ఒకరిపై మీ నమ్మకాన్ని ఉంచండి మరియు వారు కొత్త ఎత్తులకు ఎగరటాన్ని చూడండి. ఈ విలువ మా ఉత్పత్తి మరియు చర్యల ద్వారా రెండు దశాబ్దాలుగా కిన్లే బ్రాండ్‌కు పునాదిగా ఉంది మరియు ఈ కమ్యూనికేషన్ ఈ విలువను సమర్థించడంలో కిన్లే మరియు కోకా-కోలా కంపెనీల నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

 
భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు కొత్త కిన్లే ప్రచార స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఇలా అన్నారు, “కిన్లే అనేది నమ్మకానికి చిహ్నం. దశాబ్దాలుగా, భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన నీటితో తన వినియోగదారులను రిఫ్రెష్ చేసింది. బ్రాండ్ యొక్క కొత్త ప్రచారంలో భాగమైనందుకు నేను గౌరవించబడ్డాను, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మరియు దాని స్వచ్ఛత మరియు సమగ్రత కోసం వారి హృదయాలను తాకుతుందని నేను ఆశిస్తున్నాను.

 
ప్రచార ప్రయాణాన్ని వివరిస్తూ, సింపుల్ స్టూడియోస్ - భాగస్వామి, సాయినాథ్ సర్బన్ ఇలా అన్నారు, “కిన్లే బ్రాండ్ ఆకట్టుకున్న ‘ట్రస్ట్’ని ధోనీ నమ్మకమైన వ్యక్తిత్వంతో సమలేఖనం చేసే POVని మనం కనుగొనవలసి ఉందని మాకు తెలుసు. మేము ధోనీతో వినయపూర్వకమైన మరియు నిజాయితీ గల విధానాన్ని ఎంచుకున్నాము, తాను నిజంగా 'నిరంతర విశ్వాసం యొక్క ఉత్పత్తి' అని అంగీకరించాడు. మేము ఈ ఆలోచనను స్ఫూర్తిదాయకమైన సినిమాటిక్ క్రియేటివ్ పీస్‌గా అనువదించడానికి పనిచేశాము మరియు కిన్లే- బ్రాండ్ మరియు ధోనీ-సెలబ్రిటీల మధ్య సంపూర్ణ సమతుల్యతను కనుగొనడంలో మేము విజయం సాధించామని భావిస్తున్నాము.