మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:22 IST)

ఇండియాను ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ మారుస్తాం : ప్రధాన మోడీ

మనదేశ జనాభా 130 కోట్లు. అందులో సింహ భాగం యువతే. కానీ, ఈ జనాభాలో పన్ను చెల్లించే వారి సంఖ్య కేవలం కోటిన్నర మంది మాత్రమే. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు. దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈ పరిస్థితి మారాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదండోయ్... ప్రజలంతా నిజాయితీగా పన్నులు చెల్లిస్తామని వాగ్దానం చేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, '2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకుందాం. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది' అని చెప్పుకొచ్చారు. 
 
పన్నులు కట్టే వాళ్లకు అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేశామని మోడీ అన్నారు. పీపుల్స్ సెంట్రిక్ (ప్రజలే కేంద్రం)గా ఉండేలా విధానాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ట్యాక్స్‌లకు సంబంధించి డిపార్ట్‌మెంట్లను పునర్వ్యవస్థీకరించామని, అవినీతికి చోటులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.