సంబంధిత వార్తలు
- ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ : సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టు
- మిమ్మలను చూసి దేశం గర్విస్తుంది : రోహిత్ సేనకు కపిల్ దేవ్ ప్రశంస
- వరల్డ్ కప్లో ఓడిన భారత్... ప్రాణాలు కోల్పోతున్న క్రికెట్ వీరాభిమానులు
- భారత క్రికెట్ జట్టు ఓటమితో గుండెపోటు ... మరణించిన టెక్కీ!
- ఆస్ట్రేలియా విజయానికి మహాభారత రోజులకు ముడేసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి
పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర తగ్గింది...
దేశంలోని పసిడి ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. దేశంలో బంగారు ధర తగ్గింది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు.. మంగళవారం ఈ ధర తగ్గింది. ఒక గ్రాముపై రూ.50 మేరకు తగ్గింది. అలాగే, గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండిధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. మంగళవారం నమోదైన వివరాల మేరకు.. కిలో వెండి ధర రూ.79000 వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో మంగళవారం నాటి బంగారు ధరలను పరిశీలిస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,640గా కొనసాగుతుంది.
అలాగే, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,790గా ఉంది. ముంబై, కోల్కతా, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,640గా ఉంది. చెన్నైలో ఈ ధర రూ.57,050గా ఉంటే, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,230కు చేరింది.
తర్వాతి కథనం
