గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (10:59 IST)

జియో జాబ్ మేళా.. 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీల భర్తీ.. త్వరపడండి..

అవును. సోమవారం జియో జాబ్ మేళా జరుగనుంది. భారత సర్కారు ఆధ్వర్యంలో జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం ఆధ్వర్యంలో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ సంచాలకులు ఎ.వేంకటేశ్వర రావు తెలిపారు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఐ.టి.ఐలో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఎలక్ట్రానికి మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాప్ట్ వేర్ లో కోర్స్ పూర్తి చేసిన వారు లేదా ఈ ట్రేడ్స్ లో సి.ఐ.టి.ఎస్ చేసిన వారు నేరుగా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో జియో గిగా ఫైబర్ ఇన్‌స్టాలేషన్, సర్వీసెస్‌లో అసిస్టెంట్ టెక్నీషియన్స్‌గా పనిచేయడానికి ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్ధులు హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో గల జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగే జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 
 
రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ సంస్థలో పనిచేయడానికి ఐ.టి.ఐతో పాటు అప్రెంటీస్ చేసిన పురుష అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అవకాశం వుంది.