1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. After 10 Covid Cases, Another Bengaluru Apartment Complex Sealed

కర్ణాటకలో మళ్లీ పెరిగిన కేసులు.. అపార్ట్ మెంట్ సీజ్.. పది మందికి కరోనా

Covid Cases
కర్నాటక రాజధానిలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఓ బిల్డింగ్‌లో పది మందికి పాజిటివ్ వచ్చింది. 15వేల మంది నివాసితులు ఉండే ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పది మంది కోవిడ్ వచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి 22వ తేదీ మధ్య వారంతా పాజిటివ్‌గా తేలినట్లు బీబీఎంపీ కమీషన్ మంజునాథ్ ప్రసాద్ తెలిపారు. దీంతో ఆరు బ్లాక్‌లను కంటేన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. 
 
ఆ రెసిడెన్షియల్ సొసైటీలో రెండు మ్యారేజ్ పార్టీలు జరగిన తర్వాత కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిలో ఎక్కువ శాతం మంది 50 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నట్లు డాక్టర్ కృష్ణప్ప తెలిపారు. మహారాష్ట్ర, కేరళ తర్వాత అత్యధిక కోవిడ్ కేసులు కర్ణాటకలోనే ఉన్నాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్‌ మంత్ర బ్యాగులు