సంబంధిత వార్తలు
- మా ఇంట్లో తుమ్మినా దగ్గినా భయపడుతున్నారు.. చివరకు సురేఖ కూడా: చిరంజీవి
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ
- జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ అరెస్టు.. అట్రాసిటీ కేసు నమోదు..
- ప్లాస్మా దానం చేస్తే ప్రాణానికి హానికరమా? చిరంజీవి ఏమన్నారు?
- జీతాలే ఇచ్చేందుకే గతిలేదు... త్రీ క్యాపిటల్స్ అవసరమా? జగన్ గారూ : వైకాపా ఎంపీ
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,171 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,065కి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,17,569 మంది కోలుకున్నారు.
గత 24 గంటల్లో 62,938 నమూనాలు, ఇప్పటి వరకు 23,62,270 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 1842కు చేరింది.
