1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Eye Mask buses for coronavirus confirmation, launched at Vijayawada

కరోనావైరస్ నిర్థారణ కోసం ఐ మాస్క్ బస్సులు, విజయవాడలో ప్రారంభం

Eye Mask buses
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా నిర్థారణ పరీక్షలో ముందున్న ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐ-మాస్క్ బస్సుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఒక్క విజయవాడ లోనే 8 బస్సులను ఏర్పాటు చేసింది.
 
అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నిర్దారణ పరీక్షలను తీవ్రపరచింది.
 
విజయవాడలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నది. విజయవాడలో రోజుకు రెండు వేలమందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చికిత్సతో కరోనా వ్యాధి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది.
About Writer
వి
తర్వాతి కథనం
ఏపీలో వాలంటీర్ల ఓవరాక్షన్.. మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అఘాయిత్యం