మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: మంగళవారం, 25 మే 2021 (19:09 IST)

కరోనాతో చనిపోయిన కూతురి శవాన్ని కారులో పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తండ్రి

కరోనా కాలంలో ఆంబులెన్స్‌లు ధరలతో జనం నానా తంటాలు పడుతున్నారు. మూడు వందల కిలోమీటర్లకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు వారు చెప్పిందే రేటు. 
 
రాజస్థాన్‌లో 34 యేళ్ళ ఒక యువతి కరోనాతో చనిపోయింది. పోటా ఆసుపత్రిలో చనిపోగా ఆమెను సొంతూరు జాల్వార్‌కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 30 కిలోమీటర్ల దూరానికి ఆంబులెన్స్ వారు ఏకంగా 35 వేల రూపాయలు అడిగారు. అప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బులు లేవని గుర్తించాడు తండ్రి.
 
దీనితో కుమార్తె మృతదేహాన్ని తన కారులోనే పడుకోబెట్టి తీసుకెళ్ళాడు. ముందు సీటును బెండ్ చేసి అందులో మృతదేహాన్ని పడుకోబెట్టాడు. ఇలా తన కుమార్తె మృతదేహాన్ని కారులోనే తీసుకెళ్ళాడు. ఈ వీడియోను ఒక జర్నలిస్టు పోస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆంబులెన్స్ మాఫియా బాగోతం బట్టబయలైంది.