1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Govt issues guidelines for 'precaution dose', vaccination for children aged 15-18 years

జ‌న‌వ‌రి 3 నుంచి స్కూళ్ల‌లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్

Government
ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్ని కుదిపేసిన కరోనా వైరస్ నుంచి చిన్నారులను కాపాడేందుకు భారత సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వయసు ఉన్న‌ వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై తాజాగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ... జ‌న‌వ‌రి 3 నుంచి రాష్ట్రంలోని స్కూళ్ల‌లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించి వ్యాక్సిన్లు వేయనున్న‌ట్లు చెప్పారు. 
 
అలాగే, అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ వృద్ధుల‌కు జ‌న‌వ‌రి 10 నుంచి అద‌న‌పు డోసు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు సూచించామ‌ని ఆయ‌న వివ‌రించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్