1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. India Reports another 2541 New Covid Positive Cases

దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు

covid
దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతి చెందగా, 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 1862 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో పాజిటివిటీ రేటు కూడా 0.84 శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయనీ రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని, మరణాల సంఖ్య 1.21 శాతంగా ఉందని పేర్కొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రిన్సిపాల్‌ గంటల పాటు మీటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీచర్