సంబంధిత వార్తలు
- ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ.. ఆ కల నెరవేరింది..
- విరాట్ కోహ్లీ ఫిఫ్టీ-రోహిత్ శర్మ రికార్డు సమం
- ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా ప్రకటించింది రేస్ ఫర్ 7 యొక్క 7వ ఎడిషన్
- భారతదేశంలో 1500 రెస్టారెంట్ల మైలురాయిని దాటిన డొమినోస్ పిజ్జా
- అహ్మదాబాద్ కాల్పులు.. 38మందికి మరణ శిక్ష, 11మందికి జీవితఖైదు
20 వేలకు దిగువకు చేరుకున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు దిగువుగా ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గత 24 గంటల్లో మొత్తం 19,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 673 మంది మృత్యువాతపడ్డారు.
ఇందులో రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. తాజాగా నమోదైన మృతులతో కలుసుకుంటే ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 5,11,903గా వుంది. అలాగే, హోం క్వారంటైన్లలో 2,24,187 మంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు 175,37,22,697గా కరోనా వ్యాక్సిన్ డోసులను వినియోగించారు.
తర్వాతి కథనం
