సంబంధిత వార్తలు
- తైగున్ను హైదరాబాద్లో ప్రత్యేక ప్రివ్యూ ద్వారా ప్రదర్శించిన వోక్స్వ్యాగన్ ఇండియా
- సమాజంలో శక్తివంతమైన సాధనంగా ప్రజాసంబంధాలు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
- అలెర్ట్: ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తాం: లండన్ వెళ్లే విమానాన్ని..?
- ఆజాదీకీ అమృత్ మహోత్సవ్ ... శ్రీకాకుళంలో ఫిట్ ఇండియా రన్
- భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వాయిదా
దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గతంలో కంటే ఇపుడు ఈ సంఖ్య బాగా తగ్గింది. తాజాగా వెల్లడైన బులిటెన్ మేరకు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
వీటిలో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 338 మంది మృతిచెందారని తెలిపింది.
ఇకపోతే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో ఒకేరోజు 72,86,883 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20,487 కేసులు ఉన్నాయని, 181 మంది మరణించారని తెలిపింది.
