శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జులై 2018 (19:18 IST)

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా క్రికెట్‌కు గుడ్‌బై

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన 31 ఏళ్ల అవానా-2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో భారత్‌ తరఫు

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన 31 ఏళ్ల అవానా-2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో భారత్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.


అవానా 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 29.23 సగటుతో 191 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అన్నీ ఫార్మాట్లకు అవానా గుడ్ బై చెప్పేశాడు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని.. తాను క్రికెట్ నుంచి తప్పుకునేందుకు సమయం ఆసన్నమైందని అవానా చెప్పుకొచ్చాడు. 
 
మరోవైపు మొహమ్మద్ కైఫ్ కూడా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన 12 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. లోయర్ ఆర్డర్‌లో జట్టును అనేకసార్లు ఆదుకున్న కైఫ్, ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. మహ్మద్ కైఫ్ తన క్రికెట్ కెరీర్‌లో 13 టెస్టులు, 125 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. 
 
టెస్టు ఫార్మాట్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా... అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి కైఫ్ పంపాడు.