సంబంధిత వార్తలు
- డకౌట్లు అవుతున్నా సరే దూకుడు స్వభాన్ని మార్చుకునేది లేదు : అభిషేక్ శర్మ
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : నెదర్లాండ్స్పై టీమిండియా ఘన విజయం
- భారత ఆటగాళ్లతో కరచాలనమా? ఏం చెప్పలేం : పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా
- పాకిస్తాన్ పొగరు, పాక్ ఆటగాళ్లు బ్యాట్లను భుజంపై వేసుకుని వీధుల్లో ఆడుకోవాల్సిందే
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : భారత్ మ్యాచ్ను బహిష్కరించిన పాకిస్థాన్
రాంచీలో అతివేగంగా బండి నడిపిన కూల్ కెప్టెన్: రూ.1000 ఫైన్
టీమిండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా పడింది. కొద్ది రోజుల క్రితమే ధోనీ మరో న్యాయపరమైన సమస్యను ఎదుర్కొన్నాడు. నివాసం కోసం కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలతో జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
తాజాగా రాంచీలో వేగంగా వాహనం నడిపినందుకుగాను ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. తన ఇంటి సమీపంలో ధోనీ వాహనం వేగంగా వెళ్లడాన్ని నగరంలోని ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. దీంతో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 183 కింద అధికారులు ఆయనకు ఈ-చలాన్ జారీ చేశారు.
ఈ ఫైన్ అమౌంట్ చిన్నదే అయినా.. ధోనీకి జరిమానా పడటం సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. రాంచీలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ-చలాన్ జారీ అయినట్లు తెలుస్తోంది.
