శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:23 IST)

కర్ర సాయంతో అడుగు తీసి అడుగు వేస్తున్న రిషబ్ పంత్

rishabh panth
ఇటీవల పెను ప్రమాదానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రిలీజ్ చేశాడు. గత నెల26వ తేదీన ఈ ఆటగాడి మోకాలికి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. 
 
గత యేడాది డిసెంబరు 30వ తేదీన రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రూర్కీ  సమీపంలో పెను ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో పంత్ తాజాగా త‌న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. క‌ర్ర సాయంతో న‌డుస్తున్న ఫొటోల్ని అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఒక అడుగు ముంద‌ుకు. ఒక అడుగు బ‌లంగా. ఒక అడుగు మ‌రింత మెరుగ్గా' అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు గురైన‌ త‌ర్వాత పంత్ సోష‌ల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.