గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:58 IST)

ఫాంహౌస్‌లో ట్రాక్టరుతో పొలం పనులు చేస్తున్న ధోనీ...

msdhoni - tractor
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త విషయాలను నేర్చుకునేందుకు అమితాసక్తిని చూపుతుంటారు. తాజాగా ఆయన ట్రాక్టరుతో పొలం దున్నుతూ కనిపించారు. ఈ ఫోటోకు నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో తన వ్యవసాయక్షేత్రంలో ట్రాక్టరుతో పొలం దుక్కిదున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో లింక్‌కు కోటి మంది వరకు చూశారు. 28 లక్షల మంది లైక్ చేశారు. 60 వేల మంది నెటిజన్స్ స్పందించారు. ఈ వీడియోలో ధోనీ పొలం దున్నుతూ చదువు చేస్తూ కనిపించారు. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ట్రాక్టరుపై ఉన్నారు. 
 
మరోవైపు, ధోనీ ఫోటో సోషల్ మీడియాలో రెండేళ్ల తర్వాత కనిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. "మొత్తానికి రెండేళ్ల తర్వాత ధోనీకి తన ఇన్‌స్టా పాస్డ్‌వర్డ్ గుర్తుకు వచ్చింది. లవ్ యూ మహి భాయ్" అంటూ కామెంట్ చేసింది.