ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:57 IST)

'బావగారూ.. బావగారూ..' అంటూ కేకలు.. సానియా మీర్జా వీడియో వైరల్

ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేస్తూ.. పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మెంటార్‌ ధోని పాక్‌ ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఫొటోలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.
 
ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న షోయబ్‌ మాలిక్‌ను ఉద్దేశించి... కొంతమంది అభిమానులు.. ''బావగారూ.. బావగారూ..'' అంటూ సంతోషంతో కేకలు వేశారు.
 
ఈ వీడియోను సానియా మీర్జా రీషేర్‌ చేయగా... నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఇరు దేశాల అభిమానులు.. ''ఇది చాలా క్యూట్‌గా ఉంది'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సానియా మీర్జా సైతం.. స్మైలింగ్‌ ఎమోజీలతో పాటు రెండు హార్ట్‌ సింబల్స్‌ జతచేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ 2018లో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఇక మాలిక్‌ కెరీర్‌ విషయానికొస్తే చాలా కాలంగా జట్టుకు దూరమైన షోయబ్‌ మాలిక్‌కు అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ ఆడే జట్టులో ఆఖరి నిమిషంలో చోటు దక్కింది. సోహైబ్‌ మక్సూద్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో మాలిక్‌ జట్టులోకి వచ్చాడు.