గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (11:45 IST)

వరల్డ్ కప్ : యువరాజ్ రికార్డును బద్ధలుకొట్టిన బంగ్లా బౌలర్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ పోటీల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు ఒకటి కనుమరుగైంది. ఈ రికార్డును బంగ్లాదేశ్ యువ బౌలర్ చెరిపేశాడు. ఈ రికార్డు ఎనిమిదేళ్ళ క్రితం యువరాజ్ సింగ్ నెలకొల్పగా, దాన్ని బంగ్లా బౌలర్ షకీబుల్ హాసన్ అధికమించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత 201లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే మ్యాచ్‌లో 50 పరుగులు చేయడమే కాకుండా, ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ఇలాంటి అరుదైన ఫీట్‌ను ఏ ఒక్క బౌలర్ లేదా ఆల్‌రౌండర్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో ఇప్పటివరకు అందుకోలేదు. 
 
ఇపుడు బంగ్లా బౌలర్ షకీబుల్ హాసన్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సోమవారం ఆప్ఘనిస్థాన్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లా బౌలర్ షకీబుల్ హాసన్ తొలుత బ్యాట్‌తో రాణించి 69 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతితోనూ సత్తాచాటాడు. మొత్తం పది ఓవర్లు వేసిన హాసన్... 29 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చాడు.