ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (13:22 IST)

ఉపాధ్యాయుడు కాదు.. కామాంధుడు.. విద్యార్థిని గర్భవతిని చేశాడు..

victimboy
ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వద్ద చదువుకునే విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు గర్భవతిని చేశాడు. ఆమె ప్రైవేట్ ఫోటోలు తీసి బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని 2022లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసించేందుకు చేరింది. అక్కడ యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్ నాయక్ అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. 
 
ఇంటి వద్ద దించే నెపంతో విద్యార్థినిని ఓ రోజు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణ శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను చరవాణిలో బంధించాడు. అనంతరం వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది ఆ కళాశాలలో కాకుండా మరో చోట చదివేందుకు వెళ్లిపోయింది. 
 
అయినప్పటికీ గోవింద్ నాయక్ తన వికృత చేష్టలు మానలేదు. ఆమె అసభ్య చిత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఇతరులకు చూపుతానని బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్ధిని గర్భందాల్చింది. విషయం తెలిసిన నిందితుడు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో దాడికి పాల్పడ్డాడు. 
 
చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. కడుపుపై దెబ్బలు తగలడంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని.. గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్ అధ్యాపకుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.