శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (15:42 IST)

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు

victim
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ కుర్రోళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురి వయసు 16, 11, 9 యేళ్లుగా ఉన్నాయి. వీరంతా కలిసి ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌లో ఉంటున్న ఓ దంపతులకు ఆరు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజూ ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. 
 
అలాగే, ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉదయం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా పెద్దమ్మాయి జ్వరంతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటుంది. చిన్నపాప ఒక్కతే అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చేది. అయితే, ఆ పాప టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు మైనర్లు ఆ బాలికను భవనంమీదకు పిలిచి లైంగికదాడికి తెగబడ్డారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక రోదిస్తూ ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ముగ్గురు పోలీసులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు.