శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (13:27 IST)

14 యేళ్ళ బాలికపై మేనమామ అత్యాచారం.. ఆపై.. నోట్లో యాసిడ్ పోసి..

అభంశుభం తెలియని ఓ చిట్టితల్లి పాలిట మేనమామ యముడయ్యాడు. ఆ కామాంధుడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అప్పటికీ వదిలి పెట్టని ఆ కామమృగం.. ఆ బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో ఐదు నెలల పాటు ఆ చిన్నారి మృత్యువుతో పోరాడింది. చివరకు ప్రాణాలు విడిచింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి ఓ మాజీ ఉపాధ్యాయుడికి తొలుత కుమారుడు పుట్టగా 18 యేళ్ల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత చాలా కాలానికి కుమార్తె పుట్టింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గత యేడాది సెప్టెంబరు 5వ తేదీన కుటుంబ సభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన మేనమామ వరుసయ్యే కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకుని, మరుగుదొడ్డిలో దాక్కుంది. అప్పటికీ వదిలిపెట్టలేదు. 
 
తలుపులు పగులగొట్టి చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో చిన్నారి విలవిల్లాడింది. ఐదు నెలలపాటు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని పాత స్థితికి తెస్తామని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. కానీ, వారి కలలు ఆవిరయ్యాయి. బాధితురాలు మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ విషయంపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.