శనివారం, 6 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (13:28 IST)

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

victim
మహారాష్ట్రలో విచిత్ర ఘటన ఒకటి జరిగింది. పురుషుడుపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడింది. భార్య కేసులో సాయం చేస్తానని నమ్మిచిన నిందితురాలు ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన పూణెలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు... ముంధ్వా ప్రాంతానికి చెందిన 37 యేళ్ల వ్యక్తికి కోత్రుడ్‌కు చెందిన 38 యేళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. తాను హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నానని ఆమె నమ్మించింది. బాధితుడిపై ఆయన భార్య పెట్టిన కేసులో న్యాయ సలహా ఇస్తూ అతనికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో అతనికి మత్తు కలిపిన శీతలపానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడింది. ఇలా వేర్వేరు ప్రాంతాలకు పలుమార్లు తీసుకెళ్లి అతనిపై ఆ మహిళ అత్యాచారానికి పాల్పడింది. 
 
అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పైగా, వివాహం చేసుకోవాలంటూ నిందితురాలు ఒత్తిడి చేస్తోందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. "నన్ను పెళ్లి చోసుకో లేదా రూ.2 లక్షలు ఇవ్వు. లేకపోతే నీపై అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపిస్తాను" అని బెదిరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.