1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 మే 2022 (15:14 IST)

నిశ్చితార్థం అయ్యింది, పెళ్లెప్పుడు అని యువతి అడిగితే కాబోయే భర్త పరార్...

marriage
విజయవాడ పాయకాపురం సుందరయ్య నగర్‌లో నివాసం వుంటున్న రమ్యకి సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించారు. గత 2020 నవంబరులో నిశ్చితార్థం జరిపించారు.


పెళ్లికి తమకు ఓ ఏడాది సమయం కావాలనీ, తన అక్కకు వివాహమయ్యాక తను పెళ్లి చేసుకుంటానని యువకుడు గడువు అడిగాడు. అందుకే రమ్య తరపు కుటుంబం ఓకే చెప్పింది.
 

ఐతే అప్పట్నుంచి రమ్య ఎదురుచూస్తూ వుంది. ఎంతకీ తను ప్రేమించిన వ్యక్తి అక్కయ్యకు పెళ్లి కుదరడంలేదు. దీనితో విసిగిపోయిన రమ్య... మన పెళ్లెప్పుడు అంటూ ప్రియుడికి వాట్సప్ సందేశం పంపింది. ఆ సందేశం చూసిన ప్రియుడు సమాధానం ఇవ్వలేదు సరికదా.. పారిపోయాడు. తమ కుమారుడు ఇలా చేయడానికి కారణం రమ్యేనంటూ యువకుడి కుటుంబం రమ్య కుటుంబంపై దాడి చేసింది.
 

ఈ దాడిలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. తమపై దాడి చేసినవారిపై రమ్య పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.