సంబంధిత వార్తలు
- Amla Navami 2025: అక్షయ నవమి, ఉసిరి నవమి నాడు ఈ పరిహారాలు చేస్తే.. అద్భుత ఫలితం.. ఏంటవి?
- సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?
- Onam: పాతాళం నుంచి బలి చక్రవర్తి భూమి పైకి వచ్చే రోజు ఓనమ్
- Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం
- శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?
క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఇలా తులసి లక్ష్మీ స్వరూపం, విష్ణువును వివాహం చేయడం వలన ఆ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన ప్రధానం, క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపారాధన మరింత విశిష్టం. తులసి కోట చుట్టూ దీపాలను వెలిగించడం అత్యంత శుభప్రదం. శివాలయం లేదా విష్ణు ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆలయాల్లోని ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టడం వలన గొప్ప పుణ్యం లభిస్తుంది.
ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం తులసి కల్యాణం అయ్యేవరకు ఉపవాసం ఉంటారు. స్వామి క్షీరసాగరం నుండి వచ్చిన రోజు కాబట్టి, పాలు లేదా పాల పదార్థాలను భుజించడం లేదా వాటిని దానం చేయడం శ్రేయస్కరం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వలన సమస్త పాపాలు తొలగి, జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
