బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:15 IST)

అయ్యప్పను పూజించడం వలన ఏమవుతుంది..?

అయ్యప్ప స్వామివారు హిందూ దేవతలలో ఒకరు. స్వామివారిని హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య - విష్ణువు, అప్ప - శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి.
 
శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో స్వామివారిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్‌లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఐదుకోట్లమంది భక్తులు దర్శనమిస్తుంటారు. 
 
నిత్య పూజా క్రమంలో గానీ, దేవాలయానికి వెళ్ళి గానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళు పూజలానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్లడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసి భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
 
స్వామివారికి బుధవారం రోజున భక్తిశద్ధలతో పూజలు చేయాలి. వారంలో ఒక్కరోజు స్వామివారిని ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా స్త్రీలు స్వామివారికి పూజలు చేయాలంటే.. కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. ముఖ్యంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడే స్త్రీలు అయ్యప్పవారికి పూజలు చేయాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది.