తిరుమలలో పెరుగుతున్న రద్దీ
తిరుమలలో శనివారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 30,338 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. .
ఇక నడకదారిన వచ్చే భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం నుంచి రద్దీ పెరిగే ఉండే అవకాశం ఉంది.