శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (17:26 IST)

ఎగురుతున్న విమానంలో రచ్చ.. కిటికీలను కాళ్లతో తన్నాడు..

passenger
passenger
గాలిలో ఎగురుతున్న విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ నెల 14న పెషావర్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న పాకిస్థాన్‌ విమానంలో సిబ్బందితో గొడవకు దిగిన ఓ వ్యక్తి.. నానా రచ్చ చేశాడు. 
 
విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు.. కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. కిటికీలను కాళ్లతో తన్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సిబ్బంది.. విమానయాన చట్టం ప్రకారం అతడిని సీటుకు కట్టేశారు. అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించిన విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. విమానం దిగిన వెంటనే దుబాయ్​లో పోలీసులకు అప్పగించారు.