1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:54 IST)

పావురం వాలిన పాపానికి కేసు నమోదు.. పాకిస్థాన్ సరిహద్దుల్లో..?

Pigeon
అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని బీఓపీ రోరన్‌వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వచ్చి అతనిపై వాలింది. దాని కాళ్లకు ఓ పేపర్ కట్టి ఉన్నట్లు గుర్తించారు. పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఈ నెల 17న ఈ ఘటన జరిగింది.
 
తనపై పావురం వాలిన వెంటనే ఆ కానిస్టేబుల్ దానిని పట్టుకున్నాడు. విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్‌కు విషయాన్ని వెల్లడించగా వెంటనే దానికి స్కానింగ్ నిర్వహించారు. దాని కాలికి కట్టి ఉన్న పేపర్‌పై ఓ నంబర్ రాసి ఉంది. 
 
ఈ ఘటనపై అమృత్‌సర్‌లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గతేడాది మేలో జమ్ముకశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్‌లో నిఘా కోసం శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే పట్టుకున్నారు.