1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:51 IST)

ఇటలీలో కరోనా.. రోడ్లపై డబ్బు.. నిర్లక్ష్యంతో 2,500మంది మృతి

ఇటలీలో కరోనా వైరస్ సోకిన ప్రజలు వైరాగ్యంతో డబ్బులను రోడ్లపై పారేస్తున్నారు. కానీ ఇది చాలామంది ఇదంతా నిజమే అన్నట్లు నమ్మేస్తున్నారు. అయితే ఇటలీలో డబ్బు రోడ్లపై పారేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 
 
అవి ఇటలీలో తీసిన ఫొటోలు కాదని, వాటికి కరోనాతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిసింది. ద్రవ్యోల్బణంతో చితికిపోతున్న వెనుజువెలాలో రద్దు చేసిన పాత నోట్లను రోడ్లపై పారేయగా తీసని ఫొటోలను ఇటలీలో తాజా ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా చైనాలో తగ్గుముఖం పడుతున్న వేళ.. ఇటలీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా కరోనా వైరస్ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది.