1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 ఆగస్టు 2021 (20:40 IST)

ఇక నో క్వారెంటైన్, దర్జాగా వచ్చేయండి సౌదీ అరేబియా

సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. భారతదేశంలో వుండి సౌదీకి ఎప్పుడు తిరిగి వెళ్లాలా అని ఎదురుచూస్తున్నవారికి ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు ఇకపై క్వారెంటైన్లో వుండక్కర్లేదనీ, నేరుగా వచ్చేయవచ్చని తెలిపింది. ఐతే ఆ రెండు డోసులు సౌదీలో తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
 
సౌదీ అరేబియాలో రెండు డోసుల వ్యాక్సిన్ అందుకున్నవారు ఇక ఎంతమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా సౌదీ విమానం ఎక్కేయవచ్చు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఐతే భారతదేశంలో డోసులు తీసుకున్నవారి సంగతి గురించి మరికాస్త వెయిట్ చేయాల్సి వున్నట్లే కనబడుతోంది.